న్యూఢిల్లీ: పంజాబ్లో ప్రధాని మోదీకి భద్రతా సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్లో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ను రహదారిపై రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ ఘటనపై రేపు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ అంశంపై ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి ఎదురైన సమస్యపై రాష్ట్రపతి స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన మోదీతో రామ్నాథ్ భేటీ అయ్యారు. పంజాబ్లో నిన్న జరిగిన భద్రతా లోపం గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించినట్లు తెలుస్తోంది. ఇది చాలా సీరియస్ అంశమని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాల ద్వారా వెల్లడైంది. మరో వైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పంజాబ్ ప్రభుత్వ ఇద్దరు సభ్యుల ప్యానల్ను ఏర్పాటు చేసింది.