న్యూఢిల్లీ : ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. లవ్లీనా దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. ఆమె సాధించిన ఒలింపిక్ మోడల్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా యువతులు సవాళ్లను ఎదుర్కొనేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్ చేశారు. టోక్యో ఒలిపింక్స్లో 64-69 కేజీల విభాగంలో బుధవారం జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది.
మూడు రౌండ్లలో టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో లవ్లీనా బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, భారత ఒలింపిక్ బాక్సింగ్ చరిత్రలో పతకం సాధించిన మూడో బాక్సర్గా లవ్లీనా రికార్డులకు ఎక్కింది. మరోవైపు వెల్టర్ విభాగం (64 నుంచి 69 కేజీలు) విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి బాక్సర్.. తొమ్మిదేళ్ల తర్వాత బాక్సింగ్లో ఒలింపిక్ పతకాన్ని సాధించగా.. మొత్తంగా మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్లో పతకం అందించిన మహిళగా నిలిచింది. మరోవైపు ఒలింపిక్స్లో అడుగుపెట్టిన తొలిసారే పతకం సాధించడం విశేషం.