జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ను పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దాని నిర్మాణంలో మార్పులకు సూచనలు అందించాల్సిందిగా కోరుతున్నారు. భవిష్యత్లో ఏదైనా అంటువ్యాధిని నియంత్రించేందుకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒప్పందం నిర్మాణం, నిబంధనల్లో మార్పు కోసం ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టింది.
ఇప్పటివరకు 17 కోట్లకు పైగా ప్రజలు కొవిడ్కు కారణమైన కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 37 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ 194 సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు నవంబర్ 29 న సమావేశమై సంస్థ నిర్మాణాన్ని ఎలా సమర్థవంతంగా తయారు చేయాలో నిర్ణయిస్తారు. ఇది భవిష్యత్లో మరే ఇతర అంటువ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడగలదని నమ్ముతున్నారు.
అంటువ్యాధులను ఎదుర్కోవటానికి సంస్థను మరింత మెరుగుదల చేసేందుకు సూచనలను స్వాగతిస్తున్నామని సంస్థ అత్యవసర వ్యవహారాల డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. భవిష్యత్లో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడం సులభతరం చేసేలా సూచనలు ఉండాలని మైక్ ర్యాన్ పేర్కొన్నారు.
2020 ప్రారంభంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రతను గుర్తించడంతోపాటు దానిని నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని డబ్ల్యూహెచ్ఓపై విమర్శలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓకు మరిన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని అందించేందుకు వీలుచిక్కుతుందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
ట్విట్టర్కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కొత్త ఐటీ నిబంధనలు పాటించాలని ఆదేశం
కేంద్రానికి మమత ఘాటు జవాబు.. ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ సీఎస్
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు.. మీరూ తెలుసుకోండి..!
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..