న్యూఢిల్లీ: ప్రజలు సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని.. రాష్ట్రంలో లాక్డౌన్ విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆదేశించారు. రాష్ట్రంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే, కొవిడ్-19 టాస్క్ఫోర్స్ వైద్యులు, ఇతర అధికారులతో సమీక్షించారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు, కొవిడ్-19 టాస్క్ఫోర్స్ వైద్యులు తాజాగా కరోనా కేసులు పెరుగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కరోనా మరణాలు కూడా పెరుగుతాయన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ కరోనా కేసులు ఇలాగే పెరిగిపోతే రాష్ట్రం మౌలిక వసతుల లేమితో ఆరోగ్య పరిరక్షణ సంక్షోభాన్ని ఎదుర్కునే దుస్థితి నెలకొందన్నారు.
ఇదిలా ఉంటే, రాష్ట్ర సచివాలయం- మంత్రాలయంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించే సాధారణ ప్రజలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపీ మాట్లాడుతూ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చిందన్నారు.
ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 3.75 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 1.07 లక్షల బెడ్లునిండిపోయాయని చెప్పారు. 60,349 ఆక్సిజన్ సరఫరా బెడ్లు ఉన్నాయని, వాటిలో 12,701 బెడ్లపై రోగులు ఉన్నారన్నారు. మున్ముందు కరోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. హెల్త్ కేర్ మౌలిక వసతుల కొరత వెంటాడుతుందని చెప్పారు.
ఆదివారం అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. దీని ప్రకారం షాపింగ్ మాల్స్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మూసే ఉంచుతారు. పలు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతోపాటు ఆర్థిక లావాదేవీలకు అనుమతిస్తున్న వేళ తిరిగి కరోనా కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది.
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్
టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!