బాస్మతి బియ్యం: ఒక కప్పు, క్యాప్సికమ్, పచ్చిబఠాణి, క్యారెట్, తరిగిన బీన్స్: పావు కప్పు చొప్పున, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), టమాటా: రెండు, పచ్చిమిర్చి: రెండు, ఎండు మిర్చి: ఆరు, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, బిర్యాని ఆకులు: రెండు, లవంగాలు: ఆరు, దాల్చిన చెక్క: రెండంగుళాల ముక్క, యాలకులు: రెండు, సాజీర: అర టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర, పుదీనా తురుము: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా క్యారెట్, పచ్చి బఠాణి, బీన్స్ రెండు నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, ఎండు మిర్చి, లవంగాలకు కొన్ని నీళ్లు చల్లి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి, అరగంటపాటు నానబెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక సాజీర, బిర్యాని ఆకు, యాలకులు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. అన్నీ బాగా వేగాక తరిగిన టమాట ముక్కలు వేసి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. మసాల ఉడికిన తర్వాత నానపెట్టిన బియ్యం వేసి రెండు నిమిషాలపాటు బాగా కలిపి, రెండు కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి. చివరగా నెయ్యి, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకుంటే మొఘలాయ్ పలావ్ సిద్ధం.