కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ‘మిసెస్ మమ్-2021’ సీజన్-5 కాంటెస్ట్లో భాగంగా గర్భ సంస్కార్ ఫైనల్ పోటీల కార్యక్రమం గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్లో సోమవారం నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 44 మంది దంపతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ డైరెక్టర్ కుల్దీప్ బెహన్ హాజరయ్యారు. బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు సిస్టర్ వసంత, డాక్టర్ సుభద్ర, గిరీష్లతో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. – శేరి లింగంపల్లి, నవంబర్ 29