హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ ప్రకటనకు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పీఆర్సీపై సోమవారం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజుల్లోనే బడ్జెట్పై చర్చ సందర్భంగా పీఆర్సీ ప్రకటన చేస్తానని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్పై సమాధానం ఇచ్చే సమయంలో పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉన్నది. ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసిన సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్కన్నా ఒకట్రెండు శాతం అధికంగానే ఇచ్చుకుందామని చెప్పారు. ఈ నేపథ్యంలో 29- 30 శాతం పీఆర్సీ వచ్చే అవకాశం ఉన్నదని ఉద్యోగవర్గాలు అంచనావేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఎంత పీఆర్సీ ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న లెక్కలను కూడా సిద్ధంచేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్తో కూడా చర్చించినట్టు తెలిసింది. సోమవారం పూర్తి వివరాలను శాసనసభా ముఖం గా ప్రకటించే అవకాశం ఉన్నది.