దక్షిణాదిన స్టార్డమ్ను సొంతం చేసుకున్న నాయికలు తమ తదుపరి లక్ష్యంగా బాలీవుడ్ను ఎంచుకుంటారు. పాన్ ఇండియా ఇమేజ్తో పాటు రెమ్యునరేషన్ అధికంగా ఉండటంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంటారు. తన బాలీవుడ్ స్వప్నం ఈ ఏడాది నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది కన్నడ కస్తూరి ప్రణీత. దక్షిణాదిన పదేళ్లుగా రాణిస్తున్న ఈ సొగసరి ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టి పెట్టింది. ‘భుజ్’ సినిమాలో అజయ్దేవ్గణ్ సరసన నటిస్తోంది. ‘హంగామా-2’లో ఓ కథానాయికగా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్లో తనకు పేరు తీసుకొస్తాయని చెబుతోంది ప్రణీత. ‘ప్రతి కథానాయిక అంతిమలక్ష్యం బాలీవుడ్ పరిశ్రమనే. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకోవడానికి హిందీ ఇండస్ట్రీ చక్కటి వేదికలా ఉంటుంది. బాలీవుడ్లో రెండు చిత్రాలతో నా సుదీర్ఘ స్వప్నం నిజమైంది’ అని చెప్పింది.