న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తన ర్యాంకింగ్ను మెరుగుపర్చుకున్నాడు. మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ 15వ ర్యాంక్లో నిలిచాడు. ఇటీవలి ప్రపంచ చాంపియన్షిప్తో పాటు జపాన్ ఓపెన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరచడం ద్వారా ఈ ర్యాంకింగ్స్ అందుకున్నాడు.
పురుషుల సింగిల్స్లో భారత్ తరఫున అత్యుత్తమంగా లక్ష్యసేన్ తొమ్మిదో ర్యాంక్లో కొనసాగుతుండగా, కిడాంబి శ్రీకాంత్ 11వ ర్యాంక్లో ఉన్నాడు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లోపీవీ సింధు ఆరో ర్యాంక్ను నిలబెట్టుకుంది.