మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోకి చేరుతున్న నీటిని అక్కడి 10 గేట్లు తెరిచి దిగువకు 23,900 క్యూసెక్కులు వదులుతుండగా.. లక్ష్మీ పంపు హౌస్లోని 2 పంపులను ఆన్ చేసి 4200 క్యూసెక్కుల నీటిని ఎగువన సరస్వతీ బరాజ్లోకి పంపిస్తున్నారు. మరోవైపు ఎల్లంపల్లి జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా కాళేశ్వరం లింక్ 2లోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడి 3, 4 మోటార్ల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ నంది జలాశయానికి, అక్కడి నుంచి జంట టన్నెళ్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్కు పంపిస్తున్నారు.