తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని తెలంగాణ కోసం కాళోజీ చేసిన కృషిని కొనియాడారు.
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 9 : ప్రజా కవి కాళోజీ నారాయణరావు మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ తెలుగు భాష, ప్రజల అవసరాల కోసం పాటుపడిన వ్యక్తి అని.. తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని నింపారని అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వ్యక్తి అని, జీవితాన్ని ప్రజల కోసం దారపోయిన మహోన్నతుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. తెలంగాణ యాస, భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటారని అన్నారు. అధికారులు తరచూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గురుకులాలను సందర్శించి విద్యార్థులతో సమావేశవుతుండాలని సూచించారు.
విద్యా వికాసపరమైన ఆలోచనలను ప్రభావితం చేయాలని, తద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసినవారమవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, డీపీఓ సునంద, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నవీన్కుమార్, మైనారిటీ సంక్షేమాధికారి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యామ్సుందర్, షెడ్యూల్డ్ కులాల అధివృద్ధి అధికారి జయపాల్రెడ్డి, డీఏఓ అనూరాధ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : జిల్లా పరిషత్ కార్యాలయంలో చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, సీఈఓ కృష్ణారెడ్డి, అధికారులు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, స్వచ్ఛంద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ ఆయన చిత్రపటాలకు నివాళులర్పించి కాళోజీ సేవలను కొనియాడారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈఓ బి.శ్రీనివాస్రావు, సిబ్బంది పాల్గొన్నారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్.. చిత్రపటానికి నివాళులర్పించారు.
చౌటుప్పల్ : మున్సిపల్ ప్రజా కవి చిత్రపటానికి వేస్తున్న మున్సిపల్ చైర్మన్ రాజు, అధికారులు, కౌన్సిలర్లు