వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టీమ్ ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ అవార్డుకు ఎంపికైంది. పర్యావరణ సానుకూలత, సృజనాత్మకత, దీర్ఘకాలిక వాణిజ్య విజయాలు.. ఈ మూడింటి ప్రాతిపదికగా కార్పొరేట్ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. నాదెళ్లతోపాటుగా మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్-చైర్మన్ బ్రాడ్ స్మిత్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆమీ వుడ్, చీఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ లూకాస్ జొప్పా ఈ అవార్డులను అందుకుంటారు. భారతీయ-అమెరికన్ వాణిజ్యవేత్త ప్రహ్లాద్ స్మృత్యర్థం కార్పొరేట్ ఎకో ఫోరం (సీఈఎఫ్) వీటిని ఏర్పాటు చేసింది.