మూడేళ్ల విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్ వరుస అవకాశాలతో తిరిగి బిజీ అవుతోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండలో కథానాయికగా నటిస్తోన్న ఆమె మోహన్బాబు సన్ ఆఫ్ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సొగసరి తెలుగులో మరో చక్కటి అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎఫ్-3 లో ప్రగ్యాజైస్వాల్ ప్రత్యేకగీతంలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇద్దరు కథానాయకులతో కలిసి ఆమె ఈ పాటలో నటించబోతున్నట్లు చెబుతున్నారు. మాస్ హంగులతో సాగే ఈ ప్రత్యేకగీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని సమాచారం.