హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ప్రగతి రిసార్ట్ డైరెక్టర్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. శనివారం ప్రగతి రిసార్ట్లో డైరెక్టర్ రామకృష్ణ, సలహాదారులు డాక్టర్ రవీందర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకులు రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, సిబ్బందితో కలిసి లక్ష్మణ్ పల్, సదాపాకు, అశ్వగంధ, ఇన్సులిన్, మాచిపత్రి, చక్రముని వంటి ఔషధ గుణాలు కలిగిన 30 మొక్కలు నాటి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.