డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సలార్ చిత్రం ఏప్రిల్ 14,2022న విడుదల కానుండగా, ఆదిపురుష్ చిత్రాన్నా ఆగస్ట్ 11,2022న రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం సమ్మర్లో సెట్స్ పైకి వెళ్ళనుండగా, ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యార ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నట్టు తెలుస్తుంది. వార్, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.