మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై రోజుకొక వార్త బయటకు వస్తూనే ఉంది. అందుకే అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు.. కోలుకుంటున్నాడు.. త్వరలోనే మన ముందుకు వస్తాడు అంటూ నిన్న మొన్నటి వరకు అందరూ చెబుతూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక మాట ఇప్పుడు అభిమానుల్లో కంగారు పుట్టిస్తుంది. దేశంలో రాష్ట్రంలో ఎన్నో సీరియస్ విషయాలు ఉండగా ఒక్క సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయం మాత్రమే అందరికీ ఇంపార్టెంట్ అయిపోయింది కదా.. ఎందుకంటే వాడు అమాయకుడు.. ఏ తప్పు చేయకుండా హాస్పిటల్లో గత పది రోజులుగా కళ్లు తెరవకుండా కోమాలో పడి ఉన్నాడు కదా.. అంటూ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యాడు పవన్ కళ్యాణ్.
ఇప్పటి వరకు వాడు కళ్లు తెరిచాడో లేదో కూడా తెలియదు.. అలాగే హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు.. అలాంటి వారి మీద ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు అంటూ పవన్ సీరియస్ అయ్యాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఆయన సీరియస్ అయ్యాడు.. ఎమోషనల్ అయ్యాడు అని కాదు.. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ కోమాలో ఉన్నాడు అనే నిజం అందరినీ కంగారు పడుతుంది. ఎంతో ఆవేశంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అసలు నిజం బయట పెట్టేశాడు. ఇప్పటివరకు కళ్లు తెరవలేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానుల్లో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఇదే వేడుకలో పవన్ తప్ప మిగిలిన వాళ్లందరూ సాయి ధరమ్ కోలుకుంటున్నాడు అని.. ఆరోగ్యం మెరుగవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ పవన్ మాత్రమే తన మేనల్లుడు కోమాలో ఉన్నాడు అనే విషయాన్ని బయట పెట్టాడు. మరి పవన్ ఆవేశంలో అలా అన్నాడా.. లేదంటే నిజంగానే సుప్రీం హీరో ఇంకా కోమాలో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇండస్ట్రీకి లాభమా.. నష్టమా..?
పవన్ కళ్యాణ్ స్పీచ్ | ఇండస్ట్రీలో వేడి రాజుకుంది.. నాని ముందుకొచ్చాడు..
Nagarjuna: హౌస్లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్మేట్స్కి నాగ్ ప్రశ్న