అమరావతి : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ ప్రకటనపై ఏపీలోనూ హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలోని వారధి ప్రాంతంలో కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియచేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట వెలసిన హోర్డింగ్పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు మంత్రి కేటీఆర్ చిత్రాలను ముద్రించారు.
వారధి సెంటర్తో పాటు నగరంలోని వేర్వేరుచోట్ల పోస్టర్లు, హోర్డింగ్లు ఏర్పాటయ్యాయి. దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ ఇంద్రకీలాద్రిపై ఏపీ టీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.