ఖైరతాబాద్, నవంబర్ 25 : డ్యాన్స్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ప్రతి నెల ఐదుగురికి తమ స్టూడియోలో ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తామని ప్రముఖ కొరియోగ్రఫర్ యూసుఫ్ తెలిపారు. పంజాగుట్టలో యూసుఫ్ ఏర్పాటు చేసిన ఎన్ఎక్స్స్టెప్ డ్యాన్స్ స్టూడియోను గురువారం సినీ హీరో ఆది, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, డైరెక్టర్ కల్యాణ్, నిర్మాత తిరుపతి రెడ్డి, స్టూడియో నిర్వాహకురాలు నీలిమాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ ఇటీవల డ్యాన్స్పై క్రేజ్ పెరిగిందని, తమ స్టూడియోలో వెస్ట్రన్, ఫోక్, హిప్హాప్, సెమి క్లాసికల్, బాలీవుడ్ స్టయిల్, జిమ్నాస్టిక్స్ డ్యాన్స్లలో నిష్ణాతులైన మాస్టర్లతో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.