రాంనగర్, ఆగస్టు 7 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష జరిగింది.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి, పోలీస్శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను పరిశీలించిన అనంతరం సెంటర్లలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల ద్వారాల నుంచి పరిసరాలను సీసీటీవీ కెమెరాలతో చిత్రీకరించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.