హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో గంజాయి భారీగా పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి మహారాష్ట్ర, నాగ్పూర్కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.