న్యూఢిల్లీ: ఎర్రకోట హింస కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి ఘటనతోపాటు అంతకుముందు కూడా నేర చరిత్ర కలిగిన మణిందర్జిత్ సింగ్. ఖేమ్ ప్రీత్ సింగ్ పంజాబీ కాగా, మణిందర్జిత్ సింగ్ డచ్చి జాతీయుడు. ప్రస్తుతం బ్రిటన్లోని బర్మింగ్హామ్లో స్థిరపడ్డ మణిందర్జిత్ సింగ్ నకిలీపత్రాలతో దేశం దాటిపోయేందుకు ప్రయత్నించి ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డాడు.
కాగా, గత జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింస చెలరేగినప్పటి నుంచి పోలీసులు ఢిల్లీ, పంజాబ్లో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించి వారి జాడ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరితో ఎర్రకోటపై హింస కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరింది.