హైదరాబాద్ : ఆంధ్ర ఒడిశా బార్డర్లోని లంబసింగి ప్రాంతాలో గంజాయి స్మగ్లర్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీసులు లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందు కోసం ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్ల కూంబింగ్ ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు 20 మంది గంజాయి స్మగ్లర్లు ఎదురయ్యారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు వారిపైకి రాళ్లను రువ్వారు. దీంతో పోలీసులు కాల్పులు జరుపడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లకు గాయాలయ్యాయి. ఇద్దరినీ నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని చింతపల్లికి చెందిన కామరాజు, రాంబాబుగా గుర్తించారు. ఘటనకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.