సిటీబ్యూరో, జూలై 13(నమస్తే తెలంగాణ): ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్ వరకు చదివాడు. అతడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని ఆశ. దీంతో సరూర్నగర్లో వైభవ్ అకాడమీని నిర్వహిస్తున్న పాలగొని శ్రీనివాస్ను సంప్రదించాడు. రూ.90వేలు చెల్లించి అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు.
ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. గత నెల వైభవ్ అకాడమీ డైరెక్టర్ పాలగొని శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేయగా, మల్లికార్జున వ్యవహారంపై కూడా సరూర్నగర్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. ఇన్నాళ్లు పరారీలో ఉన్న మల్లికార్జునను పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసిన ప్రధాన సూత్రధారి అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బ్రిజేశ్ తివారీ పరారీలో ఉన్నాడు.