55 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
మారేడ్పల్లి, జూన్ 8 : రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎ.నర్సయ్య, ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనులతో కలిసి రైల్వే ఎస్పీ డాక్టర్ బి.అనురాధ వివరాలు వెల్లడించారు. జార్ఖాండ్ రాష్ర్టానికి చెందిన రంజన్ కుమార్, క్లాత్ బిజినెస్, యూపీకి చెందిన రాజీవ్ రట్రోజి, కృత్రిమ ఆభరణాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
వీరిద్దరూ ఆదాయం సరిపోకపోవడంతో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. 2019 నుంచి 11 సార్లు రైళ్లలో దొంగతనం చేశారు. అయితే బుధవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిందితులిద్దరు అనుమాన్పాదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఇప్పటికే వీరిపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో 8 కేసులు, నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక కేసు, సామార్లకోట పరిధిలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నర్సింహ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.