హైదరాబాద్ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస్ రమేశ్ను ఒడిశా పోలీసులకు చిక్కాడు. శంకర్ స్వగ్రామం మెదక్ జిల్లా ముత్తరాసి చెట్ల గ్రామం కాగా.. అతని తలపై రూ.20 లక్షల రివార్డ్ ఉన్నది. 28 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో శంకర్ కీలక స్థానాల్లో పనిచేశాడు. ద్విచక్ర వాహనంపై చికిత్స నిమిత్తం దవాఖానకు పెద్ద బైలు ఏరియా కమిటీ సభ్యుడు మాధవి సోనాలి అలియాస్ కిరణ్తో కలిసి వెళ్తున్నండగా శంకర్ బైపర్గూడ వద్ద ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.