అమరావతి : టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్పిల్వే ఆపేసి డయాఫ్రం వాల్ నిర్మించారని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కాఫర్డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్వాల్ కట్టి తప్పు చేశారని మండిపడ్డారు.
జగన్ సర్కార్ తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము సాధ్యమైనంత తొందరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం వద్ద పునాధులతో ఉన్న స్పిల్వేను, అప్రోచ్వేను పూర్తి చేశామని వివరించారు. ఇటీవల వచ్చిన 26 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడం జరిగిందన్నారు.
అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు అహర్నిశలు అప్రమత్తంగా ఉండి పనిచేయడం వల్ల నష్టాన్ని పూర్తిగా నిలవరించామని, అందుకు తమ శాఖ అధికారులను అభినందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.