హైదరాబాద్ : ప్రసిద్ధ తెలుగు కవయిత్రి, మొల్ల రామాయణ రచయిత్రి మొల్లమాంబా జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మొల్లమాంబా జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై గల మొల్లమాంబా విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మొల్ల చేసిన సేవలను, రచనలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి బాలకృష్ణ, దుగుంట్ల నరేష్, నాగపురి భాస్కర్, రాంకుమార్, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కుమ్మరి కుల బాంధవులు పాల్గొన్నారు.