ముంబై: వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పొకో X3 ప్రొ స్మార్ట్ఫోన్ను కంపెనీ భారత్లో లాంచ్ చేసింది. X సిరీస్లో విడుదలైన మూడో ఫోన్ ఇది. కంపెనీ ఇప్పటికే పొకో X3, పొకో X2 మార్కెట్లోకి తీసుకొచ్చింది. 48 MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 33 W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ 860 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తోన్న ఫోన్ను ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే దాదాపు రెండు రోజులు పని చేస్తుందని కంపెనీ పేర్కొంది.
6జీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .18,999 కాగా 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించారు. ఫోన్లు గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ, గోల్డెన్ బ్రాంజ్ కలర్లలో లభిస్తుంది. ఏప్రిల్ 6 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా పొకో ఎక్స్3 ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి తక్షణమే రూ.1000 డిస్కౌంట్ లభించనుంది.