బెంగళూరు,జూలై : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ పోకో సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ” పోకో ఎఫ్3 జీటీ “పేరుతో మార్కెట్లో విడుదల కానున్నది. దీనిని ఆగస్టు 10 తేదీలోపు విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల చైనాలో లాంచ్ అయిన రెడ్మీ కే 40 గేమ్ ఎన్హేన్స్డ్ ఎడిషన్కు రీ బ్రాండెడ్ వెర్షన్గా ఈ ఫోన్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోలో కూడా సంస్థ ఇదే విషయాన్నివెల్లడించింది.
ఈ ఫోన్ ఐదు వేరియంట్లలో లభించనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ.23,000కు లభిస్తుంది. పోకో ఎఫ్ 3 జిటి ఇండియా ధర రూ.25 వేల నుంచి రూ.30,000 మధ్య ఉండే అవకాశం ఉంది. పోకో ఎఫ్ 3జీటీ స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+AMOLED డిస్ప్లేను అందించనున్నారు. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్పై పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అందించింది. 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,065 mAh బ్యాటరీ ఉన్నది.
5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్సీ పోర్ట్లను అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 12.5తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 64MP ప్రైమరీ లెన్స్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2 ఎంపి మైక్రో కెమెరాను కూడా ప్యాక్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది.