నస్రుల్లాబాద్/రుద్రూర్, సెప్టెంబర్ 29: నస్రుల్లాబాద్, రుద్రూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్పతో కలిసి పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మపండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం గా సభాపతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే బతుకమ్మకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు.
రుద్రూర్ మం డల కేంద్రంలోని అంగడీబజార్, గ్రామ పంచాయతీ కార్యాల యం వద్ద మహిళలతో కలిసి స్పీక ర్ దంపతులు బతుకమ్మ ఆడిన అనంతరం దుర్గమాతను దర్శించుకున్నారు. నస్రుల్లాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠ ల్, జడ్పీటీసీ జన్నూబాయి, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీ కో -ఆప్షన్ సభ్యుడు మాజీద్,సర్పంచులు పా ల్గొన్నారు. రుద్రూర్లో ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వసంతా సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ పత్తి సావి త్రి, జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము పాల్గొన్నారు.