హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య కమిషరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న పీఎం ప్రసన్నలతపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కోటాలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలోకి చేరిన ఆమెను సస్పెండ్ చేస్తూ ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రసన్నలత తండ్రి పీటర్ సర్వీసులో ఉండగా మరణించారు. ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎయిడెడ్ టీచర్గా పనిచేస్తున్నారు. కారుణ్య కోటాలో నియామకం కోరేవాళ్లు ఎలాంటి ఆస్తిపాస్తులు లేనివారై ఉండాలి. కుటుంబీకులెవరూ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై ఉండొద్దు. కానీ, తల్లి సౌభాగ్యమ్య టీచర్గా పనిచేస్తుండగానే ప్రసన్నలత ఉద్యోగంలో చేరారు. ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆమెపై సస్పెన్షన్ వేటువేసినట్టు జలీల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.