ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సందర్భంగా బెనెట్ కు ఇవే నా అభినందనలు. దౌత్య సంబంధాల ఉన్నతీకరణ కు 30 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని వచ్చే ఏడాది మనం వేడుక గా జరుపుకోనున్న తరుణంలో మీతో భేటీ కావడం కోసం, మన రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలంగామార్చుకోవడం కోసం నేను వేచిచూస్తున్నాను’’ అని ట్వీట్టర్ ద్వారా ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.