ఢిల్లీ,జూలై :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన టూర్ లో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతో పాటు,కొన్నిపథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో బిహెచ్ యు లోని ఎమ్ సిహెచ్ లో 100 పడకల విభాగం,గొదౌలియాలో మల్టీ లెవల్ పార్కింగ్, గంగానదిలో పర్యటన అభివృద్ధికి ఉద్దేశించిన రొ-రొ వెసల్స్,వారణాసీ ఘాజీపుర్ హైవే లో త్రీ లైన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వంటివి ఉన్నాయి. 744 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.
దాదాపు 839 రూ.కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులకు,ప్రజాఉపయోగకరమైన పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. వాటిలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీయరింగ్ ఎండ్ టెక్నాలజీ (సిఐపిఇటి) కి చెందిన సెంటర్ ఫార్ స్కిల్ ఎండ్ టెక్నికల్ సపోర్ట్, జల్ జీవన్ మిషన్ లో భాగం గా చేపట్టే 143 గ్రామీణ పథకాలు,కర్ఖియాన్విలో మామిడి,కాయకూరల సమీకృత ప్యాక్ హౌస్ లు కూడా ఉన్నాయి.
‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ ఎండ్ కన్ వెన్షన్ సెంటర్ను ప్రారంభించనున్నారు. దీనిని1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్ను జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా)సహకారంతో నిర్మించారు. అనంతరం ఆయన బిహెచ్ యులో మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని తనిఖీ చేస్తారు. కోవిడ్ చర్యలపై సమీక్ష జరుపనున్నారు.