న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్ఎస్సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలువన్నారు. ఈ ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్ ఉండడంతో ప్రధానికి ఈ అవకాశం వచ్చింది. వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగే సమావేశంలో సముద్ర భద్రత మెరుగుపరచడం.. అంతర్జాతీయ సహకారంపై ఉన్నత స్థాయి చర్చ జరుగనుంది. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్పీ) సభ్య దేశాలకు చెందిన దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నట్లు పీఎంఓ పేర్కొంది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్థంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని వివరించింది.