న్యూఢిల్లీ : దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. టాయ్ కథాన్-2021 వర్చువల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం కోట్లాది రూపాయల విలువైన 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడం ముఖ్యమన్నారు. ప్రపంచ బొమ్మల మార్కెట్లో సుమారు వంద బిలియన్ డాలర్ల వాటా కాగా.. భారత్ వాటా 1.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉందన్నారు. ఈ సందర్భంగా బొమ్మల ప్రాముఖ్యతను తెలిపారు. ‘పిల్లల మొదటి పాఠశాల కుటుంబమైతే.. తొలి పుస్తకం, మొదటి నేస్తాలు బొమ్మలు’ అన్నారు. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమలకు ఊతమ్వివాలని, ప్రపంచ స్థాయి మార్కెట్ను సృష్టించేందుకు కృషిచేయాలన్నారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ ఉంద ఉందన్నారు. కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సైతం హాజరయ్యారు. టాయ్కాథన్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డీపీఐఐటీ, వస్త్ర మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఏఐసీటీఈలు సంయుక్తంగా నిర్వహించాయి.