న్యూఢిల్లీ: బ్రెజిల్ ప్రధానికి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ద్వారా బ్రెజిల్కు చెందిన అమెజానియా-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ బ్రెజిల్ ప్రధానిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ద్వారా అమెజానియా-1 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా బ్రెజిల్ ప్రధాని జైర్ బోల్సోనారోకు అభినందనలు. అంతరిక్ష సహకారంలో, బ్రెజిల్ శాస్త్రవేత్తలకు సాయపడటంలో ఇది మాకు చారిత్రక ఘట్టం అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇస్రోకు, అంతరిక్ష విభాగం పరిధిలోని ప్రభుత్వ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కు కూడా ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందనలు తెలియజేశారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ51 ఈ ఉదయం 10.24 గంటలకు బ్రెజిల్కు చెందిన అమెజానియా-1తో పాటు భారత్కు చెందిన మరో 18 ఉపగ్రహాలను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఆయా ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.