హైదరాబాద్, జూన్ 21: నీటి ట్యాంకుల తయారీ సంస్థ ప్లాస్టో సరికొత్త టెక్నాలజీతో ఆరు లేయర్లతో తయారు చేసిన ట్యాంక్ను మార్కెట్కు పరిచయం చేసింది. ఈ ట్యాంక్ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చునని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ ట్యాంక్తో పోలిస్తే ఇది సగానికి సగం ఎత్తు ఉండటంతో మరింత సులువుగా శుభ్రం చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంక్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతున్నదని, అధిక ఎత్తులో ఉండటంతో శుభ్రం చేయడం కష్టతరమవుతున్నదని, ఈ సరికొత్త గోల్డ్ ఆరు లేయర్లు కలిగిన ట్యాంక్తో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ట్యాంక్ 1,000 లీటర్లు, 750 లీటర్లు, 500 లీటర్ల కెపాసిటీల్లో లభించనున్నది. కనీస ఎత్తు 32 అంగుళాలు.