జీడిమెట్ల పారిశ్రామిక వాడలో
ఓపెన్ నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు
జీడిమెట్ల, మే25: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా ఓపెన్ నాలాలను సంబంధిత అధికారులు నిర్మించారు. సంబంధిత కాం ట్రాక్టర్ పర్యవేక్షణ లోపం కారణంగా పారిశ్రామిక వాడ లో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు,చెత్తాచెదారం పేరుకుపోయింది. ముఖ్యంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్ 5లో ఉన్న కాంతా ఫాలిమర్స్ కంపెనీ ఎదురుగా ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు రోడ్డుపైనే పారిశుధ్యం లోపంతో కంపుకొడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జీడిమెట్ల ఐలా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో నాలాలో వ్యర్థాలు పేరుకుపోవడంతో వరద నీరు ఎలా వెళ్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఐలా అధికారులు స్పందించి సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని నాలాలో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం
-ఎ.విజయ, జీడిమెట్ల ఐలా కమిషనర్
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో పేరుకపోయిన వ్యర్థాల విషయమై జీడిమెట్ల ఐలా కమిషనర్ ఎ.విజయను వివరణ కోరగా సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేలా చూస్తామని తెలిపారు. వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.