నిర్మల్ : జిల్లాలోని మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క అదిప్పుడు చెట్టయింది. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మామడకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఎం కేసీఆర్ నాటిన మొక్కను పరిశీలించి ఆ చెట్టు వద్ద ఫొటో దిగారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. నేడు మనం నాటే మొక్కనే రేపటి తరాలకు ఇచ్చే గొప్ప సంపద అనడానికి ఇలాంటి వనాలనే నిదర్శనమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా