పైనాపిల్ ముక్కలు: అర కప్పు, బియ్యం: ఒక కప్పు, తరిగిన క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, తరిగిన అల్లం, వెల్లుల్లి: ఒక టీస్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: రెండు, ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, నూనె: మూడు టేబుల్ స్పూన్లు, సోయా సాస్: ఒక టీస్పూన్, చిల్లీ సాస్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత.
బియ్యాన్ని బాగా కడిగి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి వేసి బాగా వేగాక క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక పైనాపిల్ ముక్కలు వేసి మరికాసేపు వేయించి సోయా, చిల్లీ సాస్, ఉప్పు, అన్నం జోడించి రెండు నిమిషాలపాటు సన్నటి మంటపై బాగా కలిపితే ఘుమఘుమలాడే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ.
ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరగడంతోపాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధి జరిగి రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది.ఎండాకాలంలో బెల్లం వేసిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. నీరసంగా ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్కను దవడన పెట్టుకుంటే సత్వర శక్తి లభిస్తుంది. బెల్లంలోని పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి.