సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 29 : పిల్లలమర్రి గ్రామంలోని శివాలయాల్లో కాకతీయుల వర్ణచిత్రాలు, శిల్పాలు, చిత్రకళలు, వాస్తు ఎంతో అద్భుతంగా ఉన్నాయని దక్షిణ కొరియా చిత్రకారిణి జాంగ్జా సియోకు అన్నారు. గురువారం గ్రామంలోని పురాతన శివాలయాలను పురావస్తు శాఖ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శివనాగిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా క్రీ.శ 208 సంవత్సరంలో రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ ఈ ఆలయాలను నిర్మించిందని, శివాలయం మండపం లోపల అమృతమథనం, త్రిపుర సంహారం, రామాయణ వర్ణ దృశ్యాలను చిత్రకారిణి జాంగ్జా సియోకు శివనాగిరెడ్డి వివరించారు. జిల్లాలోని పురాతన దేవాలయాలు, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషి చేస్తున్నారని ఆమెకు తెలిపారు.