అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏపీ పీజీ సెట్ 2022 ఎంట్రన్స్ నోటిఫికేషన్ ను ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది . ఈసారి కడప యోగి వేమన యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తుందని వెల్లడించింది. వచ్చేనెల సెప్టెంబర్ 3, 4, 7 ,10, 11 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.