ముంబై,జూన్ 30: కరోనా నేపథ్యంలో గతంలో క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో వారి బ్యాకు ఖాతా వివరాలను, కేవైసీ ప్రక్రియను అప్ డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని తెలిపింది. ఇటీవల పలు బ్యాంకులు విలీనమయ్యాయి. దీంతో ఆ బ్యాంకుల ఐ ఎఫ్ ఎస్సీ కోడ్స్ మారే అవకాశం ఉన్నది.
కాబట్టి క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి వారి వివరాలను అప్డేట్, కొత్త అకౌంట్స్ను లింక్ చేయాలని ఇటీవల విలీనమైన బ్యాంకుల కస్టమర్లను ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ పీఎఫ్ ఖాతాలను బ్యాంకులతో లింక్ చేయకుంటే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు వారి మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు. ప్రస్తుతం దేశంలో ఆరు కోట్లకు పైగా పీఎఫ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా పీఎఫ్ కస్టమర్లు తమ ఖాతాలను ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే చేయాలి. లేదంటే వారు ఈపీఎఫ్ఓ ఇతర సేవలను ఉపయోగించుకోలేరు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్క స్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58వేల కోట్లు ఉన్నట్లు తెలిపింది.