లక్నో: పెట్రోల్ బంక్ యజమానిని కిడ్నాప్ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ బంక్లో పని చేసే సిబ్బంది, ఇతరులు అడ్డుకుని అతడ్ని కాపాడారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి శివపురిలోని తర్నా ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు నలుగురు వ్యక్తులు ఎస్యూవీలో వచ్చారు. కారులో పెట్రోల్ నింపుకున్న తర్వాత పెట్రోల్ బంక్ యజమానితో ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. మరో ఇద్దరు వ్యక్తులు కారును తమ వద్దకు తీసుకుని రావాలంటూ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి సైగ చేశారు. దీంతో ఆ కారు వారి వద్దకు రాగా పెట్రోల్ బంక్ యజమానిని బలవంతంగా అందులోకి ఎక్కించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
కాగా, దీనిని గమనించిన పెట్రోల్ బంక్లో పని చేసే సిబ్బంది వెంటనే స్పందించారు. కారు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి యజమానిని కిడ్నాప్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో కలిసి అతడ్ని కాపాడారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు కారులో అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Caught On Camera: Petrol Pump Owner Escapes Kidnapping Attempt In UP https://t.co/aNmycAzLhN pic.twitter.com/4J0Kt3aVLn
— NDTV (@ndtv) October 1, 2022