లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంపు
న్యూఢిల్లీ: రెండు రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా విరామం ఇచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను పెంచడంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19కి పెరుగగా.. ముంబైలో రూ.112.11కి చేరింది. అలాగే లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.94.92కు ఎగబాకగా.. ముంబైలో రూ.102.89కి పెరిగింది. రాజస్థాన్లోని గంగానగర్ పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటరు పెట్రోల్ ధర రూ.118.23 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.109.04గా ఉన్నది.