న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మంగళవారం స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్పై 22 పైసలు, డీజిల్పై 23 పైసల చొప్పున తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.56, డీజిల్ రూ.80.87కి చేరింది. ముంబైల్లో లీటర్ పెట్రోల్ రూ.96.98, డీజిల్ రూ.87.96, చెన్నైలో పెట్రోల్ రూ.92.58, డీజిల్ రూ.85.88, కోల్కతాలో రూ.90.77, డీజిల్ రూ.83.75, హైదరాబాద్లో రూ.94.16, డీజిల్ రూ.88.20కు తగ్గాయి. దేశంలో రికార్డు స్థాయికి చమురు ధరలు చేరగా.. ఇంతకు ముందు ఈ నెలలో వరుసగా రెండుసార్లు ధరలు తగ్గాయి.
ఇవి కూడా చదవండి..