వారణాసి : కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన గురువారం రాత్రి శివపురిలోని తార్న ప్రాంతంలో చోటుచేసుకున్నది. ఎస్యూవీలో వచ్చిన నలుగురు.. వాహనంలో ఇంధనం నింపుకున్నారు. ఆ తర్వాత బంక్ యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు.
వీడియాలో ఓ వ్యక్తి పెట్రోల్ పంప్ యజమానితో వాదనకు దిగగా.. మరో ఇద్దరు వాహనంలో ఉన్న వ్యక్తి సైగలు చేశారు. దీంతో సదరు వ్యక్తి వాహనాన్ని తీసుకొని రాగా.. గొడవకు దిగిన వ్యక్తి వాహనం డోర్ తీసి.. బంకు యజమానిని అందులోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుతో పాటు సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గురించి, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.