స్పష్టం చేసిన హైదరాబాద్ వృక్ష పరిరక్షణ కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరులు, సంస్థలు తమ స్థలాల్లో ఉన్న చెట్లు నరికివేయాలన్నా, మరో చోటకు మార్చాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ వృక్ష పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది.
తాము ప్రత్యేకంగా రూపొందించిన ‘tgfmis.com’ వెబ్సైట్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సంబంధిత అధికారి అనుమతి పొందిన తర్వాతే చెట్ల నరికివేత లేదా స్థల మార్పిడి చేయాలని, లేనిపక్షంలో వాల్టా చట్టం 2005 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.