హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శంభునిపల్లిలో బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలపై దళితులు, టీఆర్ ఎస్ నాయకులు తిరగబడ్డారు. దళిత బంధు కింద ఇద్దరు ముగ్గురికీ మాత్రమే డబ్బులు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ.. దళితవాడలో తిప్పేందుకు ఈటల రాజేందర్ ప్రచార రథాలను పంపించగా వాటిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రజలకు బీజేపీ ఏం చేస్తుందో ప్రచారం చేసుకోవాలే కానీ, కేసీఆర్ దళితబంధు గురించి విమర్శిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
ప్రచారరథంతో పాటు బీజేపీ నాయకులు కార్లలో రాగా “దళితబాంధువుడు కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి, టీఆర్ ఎస్ జిందాబాద్” అంటూ ప్రజలు నినాదాలు చేశారు. వాహనాలను అడ్డగించి నాయకులను నిలదీశారు. ఈటల రాజేందర్ వర్గీయులు దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మున్ముందు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దాంతో బీజేపీ నాయకులు ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.
కాగా దళితుల వెంట టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాసాపల్లి సదానందంతోపాటు గ్రామశాఖ నాయకులు కొత్తూరి రమేశ్, మారపెల్లి ప్రవీణ్, రాసపెల్లి సంపత్, రాజు, అఖిల్, సిరికొండ రమేశ్, కొత్తూరి సారయ్య, వాసల సంతు, కొత్తూరి అభి, పులి నరేశ్, కొత్తూరి సూరజ్, కొత్తూరి సది తదితరులున్నారు.