న్యూఢిల్లీ: ఏనుగుల గుంపుతో సెల్ఫీ తీసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. దీని కోసం రోడ్డు మధ్యలో వాహనాలు ఆపారు. ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ కోసం ఆ ఏనుగుల గుంపు సమీపానికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఏనుగులు వారి వెంటపడ్డాయి. అయితే ఆ వ్యక్తులపై దాడిని అవి విరమించుకున్నారు. దీంతో వారు బతికిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్లో శనివారం పోస్ట్ చేశారు. జంతువులతో సెల్ఫీలు ప్రమాదకరమని హెచ్చరించారు. ‘వన్యప్రాణులతో సెల్ఫీ మోజు ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యక్తులు అదృష్టవంతులు. సున్నితమైన ఏనుగుల గుంపు వారి ప్రవర్తనను క్షమించాయి. లేకపోతే శక్తివంతమైన అవి వారికి గుణపాఠం చెప్పడానికి పెద్దగా సమయం పట్టదు’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. ఇప్పటికే 63 వేలకుపైగా ఈ వీడియోను వీక్షించారు. నెటిజన్లు కూడా ఆ వ్యక్తుల తీరుపై మండిపడ్డారు. ఒకవేళ ఏదైనా జరుగరానిది జరిగితే జంతువులనే తప్పుపడతారని ఒకరు అన్నారు. వన్యప్రాణులతో చెలగాటమాడేవారికి భారీగా జరిమానాలు విధించాలని మరొకరు డిమాండ్ చేశారు.
Selfie craze with wildlife can be deadly. These people were simply lucky that these gentle giants chose to pardon their behaviour. Otherwise, it does not take much for mighty elephants to teach people a lesson. video-shared pic.twitter.com/tdxxIDlA03
— Supriya Sahu IAS (@supriyasahuias) August 6, 2022